తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి
జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి
ఏ ఒక్క నాయకుడు… కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోము
వచ్చేది కూటమి ప్రభుత్వమే… నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాము.
తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన జనసేన అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి.
• జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి
• ఏ ఒక్క నాయకుడు… కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోము
•
వచ్చేది కూటమి ప్రభుత్వమే… నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాము.
• తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన జనసేన
అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
ధార్మిక క్షేత్రమైన తిరుపతి నగరాన్ని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఓడించి, ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పని చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయంతో అడుగులు వేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు బూత్ స్థాయి నుంచి ఒకే మాటగా, వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ చేయాలన్నారు. వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఊపిరి తీసుకోగలరని తెలిపారు. శుక్రవారం రాత్రి తిరుపతికి విచ్చేసిన శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలుగుదేశం, జనసేన నాయకులతో వేర్వేరుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు తిరుపతి వచ్చారు. అనుసరిచాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
తొలుత తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజారాజ్యం పార్టీ తరఫున శ్రీ చిరంజీవి గారు పోటీ చేసిన సమయంలో అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి చేసిన దౌర్జన్యాన్ని ఎవరూ మరచిపోలేదు. అదే వ్యక్తి గత అయిదేళ్లుగా తిరుపతిలో, తిరుమల కొండపై ఏ స్థాయిలో తన నైజాన్ని చూపిస్తున్నాడో.. ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు అతని వారసుడు. వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు, గూండాగిరీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది. ఇది మన అందరి సమష్టి బాధ్యత.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాము. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశాము. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి విషయంలో ఎన్నో
జనసేన
ఈ అంతర్గత సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ కె. నాగబాబు గారు, శ్రీ టి. శివశంకర్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు, కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు పాల్గొన్నారు. తిరుపతి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డా.పి.హరిప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జ్
FULL PROJECT 1
FULL PROJECT 2
XML FILE
PHOTO LINK
SONG LINK



