నాయకులు కూడా అంతే బాధ్యతగా మెలగాలని ఆశిస్తున్నాను. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు మనం చూపిద్దాం. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజల మన్ననలు అందుకొనేలా నడుచుకోవాలి. గెలుపు తీసుకువచ్చే అతిశయం ఉండకూడదు.
ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ కీలకం కానున్న తరుణంలో జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి. ప్రతి చర్చలో పాల్గొనేలా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం మీద స్పందించేలా దేశమంతా జనసేన వాణి వినిపించేలా ఎంపీలు పనిచేయాలి. గెలిచిన ఇద్దరూ 5 కోట్ల మంది తరఫున నిలబడాలి. ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇవ్వని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారు. ఇదో పెద్ద బాధ్యత దానిని అంతే సక్రమంగా నిర్వర్తించాలి. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చేలా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా జాగ్రత్తగా పనిచేయాలి. నాతో సహా అందరికీ భారీ మెజార్టీని ఇచ్చి ప్రజలు గెలిపించారు. అంటే ప్రజలు అంత నమ్మకాన్ని మనమీద ఉంచారని చేసుకోండి.
• ప్రజలకు ఏ కష్టం వచ్చిన స్పందిస్తాము
నాతో సహా ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఉన్నత దశలో పయనించాలి. దానికి ప్రతి ఒక్కరు ప్రణాళికబద్ధంగా పనిచేయాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లోనే ఉన్నారు. వారిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ప్రజాప్రతినిధులుగా మన మీద చాలా ఉంది. దానిని మనం వందశాతం నెరవేర్చాలి. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను బయటకు తీసుకొచ్చి నవ పునాదులు బలంగా నిర్మించాలి. దీనికి ప్రతి ఒక్కరి శ్రమ అవసరం. ప్రజాప్రతినిధులు అంటే ఇంత అద్భుతంగా ఉంటారా అని ప్రజలు మనల్ని మెచ్చుకునేలా పని చేద్దాం. జనసేన పార్టీ కార్యాలయం కొత్తగా నిర్మితమవుతోంది. దానిని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా… ఏ నష్టం పలకరించినా ఎల్లవేళలా జనసేన పార్టీ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయి. వారికి అండగా ఉండేందుకు అన్ని సమయాల్లో సదా సిద్ధంగా ఉందాం”
అన్నారు
Story Project 6
DOWNLOAD
DOWNLOAD
Alight Motion New App
PicsArt New App



