3వ తరగతి నుండి టోఫెల్ పరీక్ష శిక్షణ, దానికి పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల గురించి శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ గారిని ప్రశ్నలు అడిగిన పార్టీ MLC పిడుగు హరిప్రసాద్ గారు.
టోఫెల్ అంశంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి, దానిపై నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తామని సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారు
గత ఐదేళ్లలో పర్యటక రంగంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, రానున్న గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, మెజారిటీ పర్యాటకులు టెంపుల్ టూరిజం ద్వారా వస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా రాష్ట్ర టూరిజాన్ని, సంస్కృతిక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – గౌ|| సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు
వైసీపీ ప్రభుత్వం రైతులకు దాదాపు 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించకుండా వారిని మోసం చేసి వెళ్ళిపోతే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే, కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 1000 కోట్ల ధాన్యం కొనుగోలు డబ్బు చెల్లించి రైతులకు అండగా నిలబడింది – గౌ|| మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
విశాఖ నగర కాలుష్య తీవ్రత అధ్యయనం కోసం, తీర ప్రాంత పరిరక్షణ కోసం అధికార యంత్రాంగానికి అనేక సూచనలు చేశాను, త్వరలో ప్రత్యక్షంగా విశాఖలో పర్యటించి క్షేత్రస్థాయిలో కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటాను, కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాను – గౌ|| ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Full project
XML file
Song link


