• మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డేగ్లూర్ బహిరంగ సభలో
జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘మహారాష్ట్ర చరిత్రలో ఎంతో మంది మహానుభావులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారు. ఆ మహనీయుల స్ఫూర్తికి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ప్రజలను విభజించి పాలించే అలాంటి పాలకులను తరిమికొట్టాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వానికి యువత, మహిళలు, మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలి. మరాఠా గడ్డపై ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తిని నిలబెట్టాల’ని జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో ఎన్డీఏ పాలనలో ప్రపంచ చిత్రపటంలో తిరంగా రెపరెపలు కనబడుతున్నాయి.. దేశం నలుమూలలా అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. నాగపూర్ నుంచి థానే వరకు నిర్మించిన సమృద్ధి మహామార్గం మహారాష్ట్ర నవనిర్మాణానికి బాటలు వేసిందని చెప్పారు. భారత దేశం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నా, మహారాష్ట్ర అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సనాతన ధర్మపరిరక్షణ కోసం, మరాఠా భాషా, సంస్కృతి కోసం పోరాటం చేద్దామన్నారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల
Full project
XML file
Song link



