తీరనున్న గొల్లప్రోలు ప్రజల కష్టాలు
గొల్లప్రోలు పట్టణానికి తాగునీరు అందించే బోర్ల వద్ద పనులు నిర్వహిస్తున్న సిబ్బంది. గొల్లప్రోలు, డిసెంబరు 4(ఆంద్రజ్యోతి): దశా బ్దాలుగా గొల్లప్రోలు పట్టణ ప్రజలు ఎదుర్కొం టున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించ నున్నది. ఇప్పటి వరకూ 3, 4రోజులకు ఒకసారి వచ్చే తాగునీటిని వచ్చే నెల నుంచి ప్రతి రోజూ అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
చొరవతో ఇందుకు నిధులు మంజూరు కావ డంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తు న్నారు. పట్టణంలో ఉన్న సుమారు 30వేల మం ది జనాభాకు, 4,750 కుటుంబాలకు ప్రస్తుతం 3, 4రోజులకు ఒకసారి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణకు తెలియడంతో తన కార్యాలయం ఓఎస్ఓ
జనవరి నుంచి రోజూ తాగునీటి సరఫరా
డిప్యూటీ సీఎం పవన్ చొరవతో
రూ.72.75లక్షలు మంజూరు మధుసూదన్, ఇతర అధికారులను గొల్లప్రోలు పంపి పరిశీలన చేయించారు. పరిస్థితులపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. వారు ఇచ్చిన నివేదికపై పవన్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారు లతో మాట్లాడారు. గొల్లప్రోలు రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన ఫిల్టర్పాయింట్ల మా ర్పు, బోర్వెల్, పంపుసెట్లు, పైపులైన్ల ఏర్పాటు, మరమ్మతులు, నూతన మోటార్ల ఏర్పాటు తది తర అత్యవసరమైన 9 పనులకు రూ.72.75 లక్షలు మంజూరు చేయించారు. యుద్ధప్రాతిపది కన పనులు నిర్వహించాలని పవన్ అధికారులు ను ఆదేశించారు. దీంతో నగరపంచాయతీ ఇంజ నీరింగ్, ఆర్డబ్లూఎస్ అధికారులు పర్యవేక్షణలో పనులు ప్రారంభమై చురుకుగా జరుగుతున్నా యి. ఈ నెలాఖరు నాటికి పనులు అన్నింటిని పూర్తి చేసి జనవరి మొదటి వారంలో పట్టణ ప్రజలకు పూర్థిస్థాయిలో తాగునీరు అందించను న్నారు. తద్వారా దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొం టున్న సమస్య పరిష్కారం కానున్నది. గొల్ల ప్రోలు నగర పంచాయతీ కమిషనరు రవికుమా ర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Font link
Full project
XML file
Song link
Video link


