మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అని తెలిసినా, హెచ్చరికలు ఉన్నా తెగించి కొండల్లో నడవడం వెనుక అక్కడి ప్రజల బాధలను స్వయంగా తెలుసుకోవాలన్న తపన, వేదన నాలో ఉన్నాయి. కాబట్టే మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు వేసేందుకు అప్పటికప్పుడు రూ.39 కోట్లు ముఖ్యమంత్రి పెద్ద హృదయంతో అందించడం సంతోషకరం. రూ.500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ లు కట్టుకున్న వారికి, రూ.2 కోట్లతో బాత్ రూంలు నిర్మించుకున్న వారికి, గిరిజనులు కష్టాలేం తెలుస్తాయి..?
• న్యూజిలాండ్ తరహాలో పాడి రైతులు ఎదగాలి
వైసీపీ పాలనలో సొంత డెయిరీలను, కొన్ని ప్రత్యేక డెయిరీలను ప్రోత్సహించారు. కనీసం పాడిరైతును పట్టించుకున్న దాఖలాలు లేవు. గోకులాలు నిర్మిస్తే పశువులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిసినా వైసీపీ నాయకులకు అవేవీ పట్టలేదు. ఇప్పుడు నిర్మించిన గోకులాలతో చిన్నస్థాయి పాడి రైతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఆదాయం పెరుగుతుంది
Full project
XML file
Font link
Song link



