Poster5 alight motion photo editing Poster 5Photo project
ఈ విజయం వెనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టం, త్యాగం ఎంతో ఉంది. గత వైసీపీ పాలనలో ఆయన్ను ఎంతలా టార్గెట్ చేశారో మనకు తెలుసు. వ్యక్తిగతంగా దూషించారు. ఈ రోజు మనమే అధికారంలో ఉన్నా దూషణపర్వం మాత్రం ఆగడం లేదు. పదవి ఉందనే అహంకారంతో ఆనాడు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి నడిరోడ్డు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనందరికి తెలుసు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన పాపానికి జన సైనికులు, వీరమహిళలపై దాడి చేయించి, అక్రమ కేసులు బనాయించాడు. ఇప్పటికీ జన సైనికులు, వీర మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అమరావతి రైతుల సమస్యలు చెప్పడానికి ఢిల్లీ వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియగానే కాకినాడకు బయలుదేరారు. మీరు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అప్పటి డీజీపీ ఆంక్షలు విధిస్తే… అరెస్టు చేసుకుంటే చేసుకోండి అని మొండి పట్టుదలతో కాకినాడ వచ్చి బాధితులను పరామర్శించారు. పార్టీ నాయకులు, జనసైనికులకు కోసం ఆయన ఎలా నిలబడతారో తెలిపే ఒక ఉదాహరణ ఇది. ఆయన ఏనాడు తన స్వార్ధం కోసం ఆలోచించలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఈ రోజు ఇంతమంది శాసనసభ్యులుగా, ఎంపీలుగా, మండలి సభ్యులుగా, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ఉన్నామంటే దానికి నూటికి నూరు శాతం శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఇచ్చిన గుర్తింపే ఇదంతా.
ఐదేళ్లపాటు దుర్మార్గంగా పాలించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. బటన్లు నొక్కుతున్నాం.. నొక్కుతున్నామని చెప్పి రాష్ట్ర భవిష్యత్తును తొక్కేశారు. పాలనపై ఏదైనా ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టి భయపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేపట్టాం. కాకినాడ నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేశాం. మత్స్యకారుల కడుపుకొట్టే 217 జీవో ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు చించేశారు. రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాం. గుంతల రోడ్లను ప్రజల ముందుపెట్టాం. వైసీపీ పాలనలో రోడ్లు ఎంతలా నాశమయ్యాయి అంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కేవలం గుంతలు పూడ్చడానికే రూ.1600 కోట్లు ఖర్చు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. అన్నపూర్ణలాంటి గోదావరి జిల్లాలోనే 42 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.14,500 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే… వీళ్లు కేవలం రూ. 2250 కోట్లు మాత్రమే ఉపయోగించుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని అభ్యర్థించి మరో నాలుగేళ్లు గడుపు పొడిగించేలా చేశారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మన రాష్ట్రంలో రైతే రాజు అంటారు. అలాంటి రైతులను కూడా మోసం చేశారు. వారికి రావాల్సిన రూ.1600 కోట్ల ధాన్యం బకాయిలను పెండింగ్ పెట్టి
Photo project

















Post Comment