జనసేన నుండి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెడుతున్నారు
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బీజేపీ మద్దతు ఫలించాయి
• జూన్ 4 తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది.
• వర్చువల్ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు అన్ని సర్వేలు, మీడియా సంస్థల నివేదికలు కూటమి అధికారంలోకి రానున్నట్లు చెబుతున్నాయని.. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన 21 కి 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు సమాచారం ఉన్నదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పక్షాన పోటీ చేసిన అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎదురైన సవాళ్లు, ఏ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ఎలా నడిచిందనే అంశాలు అభ్యర్ధులను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్ధులంతా వారి అనుభవాలను పంచుకున్నారు.
శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహం, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, భారతీయ జనతా పార్టీ పెద్దల మద్దతు ఫలించాయి. కూటమికే పట్టం కట్టాలని ప్రజలు తీర్పునిచ్చారు. జూన్ 4 తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెడుతున్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పరిస్థితులను బట్టి ఇబ్బందులు ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లారు. మనందరికీ వెన్నెముక శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 17 ఏళ్ల రాజకీయ అనుభవం, 10 సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరు, ఆయన కష్టం, శారీరకంగా, మానసికంగా ఎంత ఒత్తిడి తీసుకుని ముందుకు వెళ్లారో ప్రత్యక్షంగా చూశాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కష్టం వృథా కారాదన్న ఉద్దేశంతో అంతా ఐకమత్యంగా పని చేశారు. ఈ ఎన్నికల్లో పరిస్థితులు వైసీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేవు. ప్రతి చోటా జనసైనికులు ముందుండి ఎన్నికల ప్రక్రియను అద్భుతంగా నడిపించారు. టీడీపీ, బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో సైతం యుద్ధం చేయాల్సి వస్తే జనసైనికులు, వీర మహిళలు గట్టిగా నిలబడ్డారు. వైసీపీ దుష్టపరిపాలన అంతం చేసి, ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మనందరి ఆలోచన ఉండాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూనుకోకపోతే రాష్ట్రం మళ్ళీ భూ బకాసురుల దోపిడీకి బలైపోయే పరిస్థితి వచ్చేదన్నారు.
బాధితులు వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుంది?
FULL PROJECT LINK
XML FILE
FONT LINK
VIDEO LINK
• మీడియా ప్రతినిధులను భయపెట్టే చర్యలు సరికావు
బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యత. వాక్ స్వాతంత్య్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి వార్తలను, జరుగుతున్న పరిణామాల్ని మీడియా సమాజానికి చేరవేస్తూ ఉంటుంది. విశాఖపట్నం బర్మా కాలనీలో శ్రీమతి సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనలో బాధితులు చెప్పింది, వారు చేసిన ఆరోపణలను మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికం. మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రజ్యోతిపైనా, వాటి ప్రతినిధులపై కేసులు నమోదు చేయడం అసమంజసం. వైసీపీ ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో మీడియాకు రకరకాల రాజకీయ రంగు పులిమి, వర్గాలుగా విభజించారు. మీడియా నియంత్రణకు జీవో నంబరు 1 తీసుకువచ్చారు. బాధితులతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించినందుకు విశాఖ నార్త్ స్థానం కూటమి అభ్యర్ధి శ్రీ విష్ణుకుమార్ రాజుపైనా కేసు నమోదు చేయడం చూస్తే – ఈ కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అనే అర్థం అవుతుంది. శ్రీమతి సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి చేసిన వారెవరో, దానికిగల కారణాలేమిటో పోలీసులు ప్రజల ముందుపెట్టాలి. ఎన్నికల అనంతరం జరిగిన హింసగా పరిగణించి ప్రత్యేక విచారణ చేయించాలి.
