ముడసర్లోవ పార్కు వద్ద పర్యావరణానికి హాని కలిగించే చర్యలు వద్దు • విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త శ్రీ ఈ.ఎ.ఎస్. శర్మ గారు ఫిర్యాదుపై స్పందించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• జీవీఎంసీ అధికారులు వివరణ కోరిన ఉప ముఖ్యమంత్రి
విశాఖపట్నంలోని ముడసర్లోవ పార్క్ పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జీవీఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని విషయాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త శ్రీ ఈ.ఎ.ఎస్. శర్మ గారు రాసిన రాసిన లేఖపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. నిత్యం వందలాది మంది ప్రజల సందర్శించే ముడసర్లోవ పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కులో భవనాల నిర్మాణానికి సిద్ధం అవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ.. ముడసర్లోవ పార్కును పరిరక్షించాలని కోరారు. ఈ విషయమై తక్షణం స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. జీవీఎంసీ అధికారులు అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియచేశారు.
Full project
Font link
XML file
Song link



