Trending name edit I love you Rcf201

ప్రజలు పాడిపంటలు, సకల సౌభాగ్యాలతో తులతూగాలి

• పాద గయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమంలో ఎమ్మెల్సీ

శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు

• ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన పుసుపు, కుంకుమ

పి

పిఠాపురం నియోజకవర్గానికి పురూహూతిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన, జనసేన పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఆకాంక్షించారు. ప్రజలు పాడి పంటలు, సకల సౌభాగ్యాలతో తులతూగాలని కోరారు. శుక్రవారం పిఠాపురంలోని శక్తి పీఠంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ “పిఠాపురంలో కొలువైన శ్రీ కుక్కుటేశ్వరస్వామి, శ్రీ పురుహూతికా అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రత పూజలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉదయం 6 గంటల నుంచే ఆడపడుచులంతా పూజలో నిమగ్నమయ్యారు. ఏటా శ్రావణమాసంలో ఒక శుక్రవారం స్థానిక శాసన సభ్యులు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే ఆడపడుచులకు పసుపు, కుంకుమతో పాటు చీర ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని మన ప్రియతమ నాయకులు, ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘనంగా కొనసాగించమని ఆదేశించారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయమన్నారు. ఇక్కడ వ్రతమాచరించిన ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపారు. ఒక్కో బ్యాచ్ కు 1500 మంది వరలక్ష్మీ వ్రతం ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో భక్తిప్రపత్తులతో కన్నుల పండువగా పూజలు జరుగుతున్నాయి. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము ” అన్నారు.

Font link

Download 

Full Project (Font add)

Download 

XML file

Download 

Song link

Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock