9వ తేదీ సాయంత్రం 400 గ్రామ పంచాయతీలకు రూ.లక్ష్మ
చొప్పున నేరుగా విరాళం అందించే కార్యక్రమం
• 400 గ్రామాలకూ ఒకేసారి అందించేలా కార్యక్రమ నిర్వహణ
• గ్రామాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయం అపూర్వం
• కూటమి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనాలి
• జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకుల టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
‘గ్రామ స్వరాజ్యంపై పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ అపారమైంది. గ్రామాలకు అనుకోని కష్టం వస్తే వాటికి సహాయం చేయడం బాధ్యతగా ఆయన తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా.. వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల వ్యక్తిగత సాయం అందించడం చరిత్రలో నిలిచిపోయే దాతృత్వం. దీన్ని ప్రతి పంచాయతీకి నేరుగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి, జనసేన పార్టీ నుంచి ఈ నెల 9వ తేదీ సాయంత్రం అందరి సమక్షంలో నిర్వహించాల’ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 పంచాయతీలకు ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తూ విరాళం ప్రకటించారు. ఈ విరాళం తాలుకా సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలకు నష్టపోయిన ఆయా జిల్లాల్లోని పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు వచ్చి విరాళం సొమ్మును అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో శ్రీ మనోహర్ గారు శనివారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందించే విరాళం పూర్తిగా
Full Project
XML file
Song link
Font link



