జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ
• మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజక వర్గంలో ప్లీనరీ • జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్
కళ్యాణ్ గారు నిర్ణయం
ప్లీనరీ నిర్వహణపై పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజక వర్గంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో కోర్ కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “2014 మార్చి 14న విశాల దృక్పథంతో, ప్రజాహితం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించారు. పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలిచారు. ఈ రోజు కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైనది. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించబోతున్నాము. పార్టీ సిద్దాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలి. ఇందుకోసం పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొంటాము. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమించుకోవాలి. వారందరినీ సమన్వయం చేసుకొంటూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తాము.
12 వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్స కార్యక్రమం డెలిగేట్స్ తో ఉంటుంది. 14వ తేదీ బహిరంగ సభ ఉంటుంది.
FULL PROJECT LINK
XML
FONT LINK
PHPTO SONG LINK



